Home> వినోదం
Advertisement

Krishnam Raju: పనిమనిషిని సత్కరించిన రెబల్ స్టార్ కుటుంబం..నెటిజన్లు ప్రశంసలు

Krishnam Raju: గత 25 ఏళ్లుగా తమ ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న పద్మ అనే మహిళను కృష్ణంరాజు కుటుంబం ఘనంగా సన్మానించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

Krishnam Raju: పనిమనిషిని సత్కరించిన రెబల్ స్టార్ కుటుంబం..నెటిజన్లు ప్రశంసలు

Krishnam Raju: రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు ఇంట్లో గత 25ఏళ్లుగా పనిచేస్తున్న పద్మ అనే మహిళను ఆయన కుటుంబం ఘనంగా సన్మానించింది. '25 ఇయర్స్ ఆఫ్ సర్వీస్' అంటూ ఆమెతో కేక్‌ కట్‌ చేసి సెలబ్రేట్‌ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలును కృష్ణంరాజు(krishnam raju) కూతురు ప్రసీద సోషల్‌మీడియా(Social Media)లో షేర్‌ చేసుకుంది. 25 ఏళ్లుగా మా కోసం చాలా చేశారు. థ్యాంక్యూ పద్మ ఆంటీ అంటూ కృతఙ్ఞతలు తెలిపారు.

Also read: Prabhas New Look: రాధేశ్యామ్ నుండి ప్రభాస్ న్యూ లుక్.. లీకైన రాధేశ్యామ్ టీజర్ పిక్స్..??

ఈ సందర్భంగా కృష్ణం రాజు స‌తీమ‌ణి శ్యామ‌లా దేవి(Shyamala Devi) ఆమెకు ఓ బంగారు గొలుసును కూడా కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  ఇంట్లో పనిచేసే మహిళను కూడా ఇంట్లో మనిషి(Maid)గా చేసుకోవడం నిజంగా గ్రేట్‌ అంటూ కృష్ణంరాజు దంప‌తుల‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ప్రభాస్‌(Prabhas)  హీరోగా నటిస్తున్న 'రాధేశ్యామ్‌' సినిమాను వంశీ, ప్రమోద్‌లతో కలిసి ప్రసీద నిర్మిస్తున్నారు. ఈ చిత్రం​ వచ్చే ఏడాది జనవరి 14న విడుదల కానుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More