Home> వినోదం
Advertisement

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హీరోయిన్

ఇండోనేషియాలో జరిగిన ఓ ఈవెంట్‌లో పాల్గొనడానికి వెళ్లిన బాలీవుడ్ నటి అక్కడ ఓ అడ్వెంచర్ స్పాట్‌లో బంగీ జంప్‌‌లో పాల్గొని ప్రమాదం బారినపడ్డారు. 

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హీరోయిన్

ఇండోనేషియాలో జరిగిన ఓ ఈవెంట్‌లో పాల్గొనడానికి వెళ్లిన బాలీవుడ్ నటి నటాషా సురి అక్కడ ఓ అడ్వెంచర్ స్పాట్‌లో బంగీ జంప్‌‌లో పాల్గొని ప్రమాదం బారినపడ్డారు. బంగీ జంప్ చేస్తుండగా ఆమె తన నడుంకు బిగించుకున్న ఎలాస్టిక్ వైర్ తెగిపోవడంతో ఎత్తు నుంచి కిందపడిన ఆమెకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. అదృష్టవశాత్తుగా ఆమె ఎత్తు నుంచి కిందపడిన చోట బండరాళ్లు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని సమాచారం. నిర్వాహకులు ఆమెను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. మరో 24 గంటలు గడిస్తే కానీ నటాషా సురి పరిస్థితి ఏంటనేది చెప్పలేం అని అక్కడి ఆస్పత్రి వర్గాలు చెప్పినట్టుగా బాలీవుడ్ మీడియా కథనాలు స్పష్టంచేస్తున్నాయి.

2006లో మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని టాప్-10లో ఒకరిగా నిలిచిన నటాషా ఆ తర్వాత బాలీవుడ్ సినిమాల్లో బిజీ అయ్యింది. ఆమె నటించిన అప్‌కమింగ్ సినిమా 'బ్లా బ్లా బ్లాక్‌ షీప్' త్వరలోనే రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సినిమాలో ప్రముఖ హిందీ టీవీ యాంకర్, సినీ నటుడు మనీశ్ పాల్ సరసన నటాషా జంటగా నటిస్తోంది. అనుపమ్ ఖేర్, మంజరి ఫడ్నిస్, అన్ను కపూర్, కేకే మినన్ ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.  

Read More