Home> క్రైమ్
Advertisement

Husband Kills Wife: భార్యను చంపి, పూల మాలతో నివాళి అర్పించిన భర్త

Husband Kills Wife, pays Tribute: భార్యను చంపి, ఆమె శవంపై పూల మాల వేసి నివాళి అర్పించాడంటే.. ఆమెను హతమార్చడానికి ముందుగానే పథకం వేసుకుని మరీ తన వెంట కత్తితో పాటు పూలమాల కూడా తెచ్చుకున్నాడని అర్థమవుతోంది.

Husband Kills Wife: భార్యను చంపి, పూల మాలతో నివాళి అర్పించిన భర్త

Husband Kills Wife, pays Tribute: గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం చోటుచేసుకుంది. గాంధీనగర్ గంటా వారి వీధిలో భార్యను అతి కిరాతకంగా హత్య చేసిన భర్త.. ఆమెకు నివాళి అర్పించిన అనంతరం వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తెనాలిలో కలకలం సృష్టించిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. కాకర్ల స్వాతి, కోటేశ్వర్ రావుకు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ జంటకు ఇద్దరు మగ పిల్లలు సంతానం. గత కొద్ది రోజులుగా భార్య, భర్తల మధ్య అప్పుల విషయమై రోజూ ఘర్షణ జరుగుతున్నట్టు తెలుస్తోంది. 

భారీగా అప్పులు చేసిన భర్త కోటేశ్వర్ రావు.. ఆ అప్పులు తీర్చుకునేందుకు భార్య పేరు మీద ఉన్న స్థలాన్ని అమ్మి డబ్బులు ఇవ్వాల్సిందిగా భార్య స్వాతిపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలిసింది. అయితే, అందుకు స్వాతి ఒప్పుకోకపోవడంతో ఇదే విషయమై ఇరువురి మధ్య నిత్యం ఘర్షణ చోటుచేసుకుంటున్నట్టు సమాచారం.

భార్య స్వాతి బ్యూటీపార్లర్ నడుపుతూ బ్యూటీపార్లర్‌పై వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని పోషిస్తోంది. ఎప్పటిలాగే గురువారం కూడా బ్యూటీ పార్లర్‌కి వెళ్లిన స్వాతి షాప్‌లో తన పని తాను చేసుకుంటోంది. అయితే భార్య తన మాట వినడం లేదని ఆమెపై కోపం పెంచుకున్న కోటేశ్వర రావు కూడా షాపుకి వెళ్లి మరోసారి ఆమెతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. భార్య స్వాతి ఇక తన మాట వినేలా లేదని భావించిన కోటేశ్వర్ రావు.. అదే కోపంతో విచక్షణ కోల్పోయి ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. తన మాట వినడం లేదనే కోపంతో కట్టుకున్న భార్య అనే కనికరం లేకుండా, 20 ఏళ్లు తనతో కలిసి నడిచిందనే విషయం కూడా మర్చిపోయి స్వాతి మెడపై కత్తితో నరికి చంపేశాడు. 

ఊహించని ఘటనకు షాక్‌కి గురైన భార్య స్వాతికి భర్త కోటేశ్వర్ రావు నుంచి తప్పించుకునే అవకాశం కూడా లేకపోయింది. భర్త చేతిలో కత్తి పోట్లకు గురైన స్వాతి అక్కడికి అక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో ఊహించని మరో విషయం ఏంటంటే.. భార్యపై పట్టరాని కోపంతో ఆమెను హతమార్చిన కోటేశ్వర్ రావు.. అనంతరం ఆమె శవంపై పూల మాల వేసి నివాళి అర్పించినట్టు తెలుస్తోంది. 

తన చేతిలోనే హత్యకు గురైన భార్య శవంపై పూల మాల వేసి నివాళి అర్పించాడంటే.. ఆమెను హతమార్చడానికి ముందుగానే పథకం వేసుకుని మరీ తన వెంట కత్తితో పాటు పూలమాల కూడా తెచ్చుకున్నాడని అర్థమవుతోంది. భార్య స్వాతిని హతమార్చి, నివాళి అర్పించిన అనంతరం కోటేశ్వర్ రావు తనకు తానుగా వెళ్లి తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. కోటేశ్వర్ రావు వెల్లడించిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Also Read : Delhi Murder Case Updates: శ్రద్దాను హత్య చేసి ముఖాన్ని కాల్చిన అఫ్తాబ్.. విచారణలో షాకింగ్ విషయాలు

Also Read : Shraddha Murder Case: శ్రద్ధా హత్యలో కీ క్లూ.. వాటర్ బిల్లుకు కనెక్షన్.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు

Also Read : Aftab Romance: ఫ్రిజ్‌లో శ్రద్ధ శవం.. ఆ అమ్మాయిలను ఇంటికి రప్పించుకుని శృంగారం ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Read More