Home> క్రైమ్
Advertisement

MP Road Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, టవేరా ఢీ... 11 మంది దుర్మరణం..

Bus Accident in MP: కారు-బస్సు ఢీకొన్న ఘటనలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం మధ్యప్రదేశ్‌లోని ఝల్లార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.

MP Road Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, టవేరా ఢీ... 11 మంది దుర్మరణం..

Madhya Pradesh Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును బస్సు ఢీకొన్న ఘటనలో 11 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం ఝల్లార్ (Jhallar) పోలీస్ స్టేషన్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక వ్యక్తి గాయపడగా... అతన్ని ఆస్పత్రిలో చేర్చారు.  ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ప్రయాణికులు ఎవరూ లేరు. మృతుల్లో ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. బస్సు మరియు కారు (టవేరా) ఎదురెదురుగా ఢీకొన్నందున కారు ముందు భాగంతో పాటు బస్సు కూడా తీవ్రంగా దెబ్బతింది. 

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైన్స్ దేహి రహదారిపై జరిగింది. పరత్ వాడా వైపు వెళ్తున్న టవేరా.. బేతుల్ వైపు వెళ్తున్న బస్సును ఢీకొన్న ఘటనలో 11 మంది అక్కడిక్కడే మరణించినట్లు ఎస్సై శివరాజ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. టవేరా డ్రైవర్ నిద్రలోకి జారుకోవడమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ (PM Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతేకాకుండా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు పరిహారం ప్రకటించారు. 

Also Read: Viral Video: మహిళ రోడ్డు దాటుతుండగా.. మీదికి దూసుకెళ్లిన ఆగిఉన్న బస్సు! ఒళ్లు గగుర్పొడిచే వీడియో 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Read More