Home> బిజినెస్
Advertisement

Stock Market today: వరుస లాభాలకు వారాంతంలో బ్రేక్​- సెన్సెక్స్​ 191 మైనస్​

Stock Market today: స్టాక్ మార్కెట్ల లాభాల జోరుకు వారాంతంలో బ్రేక్ పడింది. మూడు రోజుల లాభాల అనంతరం.. నేడు నష్టాలతో ముగిశాయి సూచీలు. బ్యాంకింగ్ షేర్లు ఎక్కువగా నష్టాలను నమోదు చేశాయి.

Stock Market today: వరుస లాభాలకు వారాంతంలో బ్రేక్​- సెన్సెక్స్​ 191 మైనస్​

Stock Market today: స్టాక్ మార్కెట్ల వారాంతంలో (శుక్రవారం) నష్టాలతో (Stocks Closing bell)  ముగిశాయి. చివరి మూడు సెషన్లలో సూచీలు భారీగా లాభాలను గడించగా.. వారాంతలో ఆ పరంపరకు అడ్డుకట్ట పడింది.

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్​ (BSE Sensex) 191 పాయింట్లు తగ్గి 57,124 వద్దకు చేరింది. నేషనల్​ స్టాక్ ఎక్స్ఛేంజీ-నిఫ్టీ (NSE Nify) 30 పాయింట్ల స్వల్ప నష్టంతో 17,042 వద్ద స్థిరపడింది.

ఇటీవల వరుసగా నమోదైన లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. దీనికి తోడు దేశంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ (Omicron scare in India) భయాలు రోజు రోజుకూ తీవ్రమవుతున్నాయి. ఇప్పటికే దేశంలో 358 కేసులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేయాలని కేంద్రం సూచించడం గమనార్హం. ఈ అంశాలన్ని మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

ఈ రోజు సెషన్​ ఎలా సాగిందంటే..

ఇంట్రాడేలో (Intraday) సెన్సెక్స్​ 57,623 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. అమ్మకాల కారణంగా ఒకానొక దశలో  56,813 కనిష్ఠానికి పడిపోయింది.

నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 17,155 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 16,909 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది.

లాభ నష్టాల్లో టాప్​-5 షేర్లు..

బీఎస్​ఈ 30 షేర్ల ఇండెక్స్​లో 8 కంపెనీలు మాత్రమే స్వల్పంగా లాభాలను నమోదు చేశాయి. మిగతా 22 కంపెనీలు డీలా పడ్డాయి.

హెచ్​సీఎల్​టెక్ 2.95 శాతం, టెక్ మహీంద్రా 2.34 శాతం, ఏషియన్​ పెంయిట్స్​ 0.62 శాతం, విప్రో 0.49 శాతం, ఇన్ఫోసిస్​ 0.43 శాతం లాభాలను గడించాయి.

ఎన్​టీపీసీ 2.73 శాతం, ఎం&ఎం 1.60 శాతం, పవర్​గ్రిడ్​ 1.58 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్​ 1.57 శాతం, డాక్టర్​ రెడ్డీస్​ 1.54 శాతం నష్టపోయాయి.

ఆసియాలో ఇతర మార్కెట్లు..

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. సియోల్​ (దక్షిణ కొరియా), థైవాన్, హాంగ్​ సెంగ్ (హాంకాంగ్​)​ సూచీలు లాభాలను గడించాయి. షాంఘై (చైనా), టోక్యో (జపాన్​) సూచీలు నష్టపోయాయి.

రూపాయి విలువ..

డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ 24 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.74.99 వద్ద కొనసాగుతోంది.

Also read: Infinix Note 11 Flipkart: ఇన్ఫీనిక్స్ నోట్ 11 సేల్ మొదలైంది.. ఆఫర్ ధర రూ.11,999 మాత్రమే!

Also read: RBI new rules: ఆన్​లైన్​ లావాదేవీలా? ఆర్​బీఐ కొత్త రూల్స్ గురించి తెలుసుకోవాల్సిందే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More