Home> బిజినెస్
Advertisement

Petrol Price Today: మళ్లీ భగ్గుమన్న పెట్రోలు, డీజిల్ ధరలు, అక్కడ సెంచరీ కొట్టిన Petrol

Petrol Price Today In Delhi 18 February 2021: తాజాగా ఫిబ్రవరి 18 (గురువారం) నాడు లీటర్‌ పెట్రోల్‌ ధర 34 పైసలు, డీజిల్ ధర 32 పెసలు చొప్పున పెరిగింది.

Petrol Price Today: మళ్లీ భగ్గుమన్న పెట్రోలు, డీజిల్ ధరలు, అక్కడ సెంచరీ కొట్టిన Petrol

Petrol Price Today In Hyderabad 18 February 2021: భారత్‌లో చమురు ధరలు రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా గతేడాది నుంచి వాహనదారుల జేబులు గుల్ల అవుతున్నాయి. తాజాగా ఫిబ్రవరి 18 (గురువారం) నాడు లీటర్‌ పెట్రోల్‌ ధర 34 పైసలు, డీజిల్ ధర 32 పెసలు చొప్పున పెరిగింది. తాజాగా పెరిగిన ధరలతో మంగళవారం నాడు ఆల్‌టైమ్ కొత్త గరిష్ఠానికి పెట్రోలు, డీజిల్ ధరలు చేరుకున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.89.88, డీజిల్ ధర రూ.80.27కు పెరిగింది. పెట్రోల్ ధరలు చెన్నైలో రూ.91.68, కోల్‌కతాలో రూ.90.78, ముంబైలో గరిష్టంగా రూ.96కి చేరింది. హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.93.45, డీజిల్‌ ధర రూ.87.55కు చేరింది. పలు రాష్ట్రాల్లోనూ పెట్రోల్ ధర ఇప్పటికే 90 రూపాయాలు దాటేసింది.

Also Read: Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో దిగొచ్చిన బంగారం ధరలు, పసిడి దారిలోనే Silver Price

లీటర్ పెట్రోల్ ధర తొలిసారిగా రూ.100 దాటింది. రాజస్థాన్(Rajasthan)‌లోని శ్రీగంగానగర్‌లో పెట్రోల్ ఒక లీటర్ ధర రూ.100.13 నమోదు చేసింది. అక్కడ డీజిల్ లీటర్ ధర రూ.92.10గా ఉంది. ఇటీవల డీజిల్ ధర సెంచరీ కొట్టగా, తాజాగా పెట్రోల్ సైతం వంద రూపాయాలు చేరుకోవడం గమనార్హం.

Also Read: EPFO Alert: ఈపీఎఫ్ వడ్డీ రావాలంటే 40 లక్షల మంది ఖాతాదారులు ఇలా చేస్తే సరి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More