Home> ఏపీ
Advertisement

ఆమె కూడా టీడీపి క్యాంపులోకి వచ్చేస్తారా..?

విశాఖజిల్లా పాడేరు నియోజకవర్గం నుండి ఎన్నికైన వైసీపీ నేత గిడ్డి ఈశ్వరి కూడా సోమవారం ఉదయం అమరావతిలో టీడీపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి

ఆమె కూడా టీడీపి క్యాంపులోకి వచ్చేస్తారా..?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఇరవై మంది జగన్ క్యాంపు నుండి టీడీపీలోకి వెళ్లగా.. తాజాగా మరో ఎమ్మెల్యే కూడా తెలుగుదేశం పంచన చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విశాఖజిల్లా పాడేరు నియోజకవర్గం నుండి ఎన్నికైన వైసీపీ నేత గిడ్డి ఈశ్వరి కూడా సోమవారం ఉదయం అమరావతికి వెళ్లి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఆమె చేరాక మరో ఇద్దరు వైసీపీ శాసనసభ్యులు కూడా తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉందని సమాచారం. ఇటీవలే టీడీపీ నుండి వైసీపీలో చేరిన కుంభా రవిబాబుకి అరకు సీటు ఇచ్చే విషయంలో వైసీపీ అధిష్టానం సుముఖత కనబరిచిన తరుణంలో ఈశ్వరి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పలు పత్రికలు తెలుపుతున్నాయి. అరకు సీటు విషయంలో కూడా ఈశ్వరి అనుయాయూలకే సీట్ ఇవ్వాలని ఆమె కోరారని సమాచారం. ఈ క్రమంలో ఆమె ఆలోచనలు పార్టీ అధిష్టానం పట్టించుకోనందున ఈశ్వరి పార్టీ వీడుతున్నారని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

Read More