Independence Day 2024: అంగరంగ వైభవంగా స్వాత్రంత్య దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి జరుగుతున్న స్వాతంత్ర్య సంబరాలు అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జెండావిష్కరణ చేసే వారి జాబితా విడుదలైంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ఎక్కడెక్కడ జెండావిష్కరణ చేస్తారో సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు వెలువరించింది. అయితే తొలిసారిగా మంత్రి హోదాలో పవన్ కల్యాణ్ ఎక్కడ జెండావిష్కరిస్తారోనని ఆసక్తి నెలకొంది.
Also Read: YS Viveka Murder Case: వైఎస్ జగన్ చెల్లెలు సంచలనం.. వైఎస్ వివేకా హత్యపై కీలక పరిణామం
రాష్ట్ర, జిల్లా స్థాయిలో స్వాతంత్య్ర వేడుకల నిర్వహణపై ఏపీ సాధారణ పరిపాలన శాఖ ప్రొటోకాల్ విభాగం ఉత్తర్వులు విడుదల చేసింది. రాష్ట్రస్థాయిలో నిర్వహించే వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో పాల్గొననున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉదయం 9 గంటలకు సీఎం చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
తొలిసారి మంత్రి హోదాలో పవన్
ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడలో జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఈ జిల్లాలోనే పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం ఉన్న విషయం తెలిసిందే. కాకినాడలో కార్యక్రమం పూర్తయిన తర్వాత పిఠాపురంలో పవన్ పాల్గొనే అవకాశం ఉంది. అనంతరం జనసేన పార్టీ కార్యాలయంలోనూ కూడా పవన్ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొననున్నారు. అన్ని జిల్లాల్లో మంత్రులు ఎగురవేయనుండగా.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రం కలెక్టర్ జెండా ఆవిష్కరించనుండడం విశేషం.
Also Read: Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ నిబంధన ఉండదు..
జిల్లాల్లో జెండావిష్కరించే మంత్రులు వీరే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి