New Year 2022: కరోనా వ్యాప్తి, ఒమిక్రాన్ వేరియంట్ భయాలు కొనసాగుతున్న వేళ.. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ సమయంలో ప్రజలు కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం (New Year Celebrations) చెప్పేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అయితే ఆంధ్ర ప్రదేశ్లోని ప్రధాన నగరాల్లో నూతన సంవత్సర వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. విజయవాడలో తాజాగా కఠిన ఆంక్షలు విధించారు (Restrictions on new Year Celebrations in Vijayawada) నగర పోలీసులు. ఈ మేరకు విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా పేరిట ఆదేశాలు జారీ అయ్యాయి.
విజయవాడలో కఠిన ఆంక్షలు ఇలా..
ఈ నిబంధనలు అతిక్రమించిన ఎవరైన తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని వెల్లడించారు విజయవాడ పోలీసులు. తాగి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, రోడ్లపై అల్లర్లు సృష్టించడం వంటి వాటికి పాల్పడితే కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరారు.
కొత్త సంవత్సర వేడుకలకోసం పిల్లలు ఎక్కడకి వెళ్తున్నారు? అనే విషయంపై తల్లిదండ్రులకు నియంత్రణ ఉండాలని పోలీసులు సూచించారు. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని తెలిపారు. ఇంట్లోనే అందరు కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవాలని కోరారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో ప్రజలంతా సహకరించాలని తెలిపారు.
Also read: Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు
Alsos read: Jahnavi Dangeti: ఆంధ్ర అమ్మాయి జాహ్నవి రికార్డ్.. నాసా ట్రైనింగ్లో పాల్గొన్న మొదటి భారతీయురాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook