Home> ఏపీ
Advertisement

తెలంగాణలో ఉరుములతో కూడిన జల్లులు

రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో ఉరుములతో కూడిన జల్లులు

తెలంగాణలో ఉరుములతో కూడిన జల్లులు

రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ ప్రకటించింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఐదు రోజులపాటు పొడి వాతావరణమే వుండనుందని వాతావరణ శాఖ ఈ తాజా ప్రకటనలో పేర్కొంది. గడిచిన 24 గంటల్లో కోస్తాంధ్రలో పలు చోట్ల చెదురుముదురు జల్లులు కురిసినప్పటికీ, తెలంగాణలో మాత్రం 9 నుంచి 17 డిగ్రీల సెల్సియస్‌ల కనిష్ట ఉష్ణోగ్రతలతో, పొడి వాతావరణమే నెలకొని వుంది.

వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా ప్రకటన ప్రకారం హైదరాబాద్, ఆదిలాబాద్‌లలో 9 డిగ్రీల సెల్సియస్‌ల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా కర్నూలు జిల్లాలోని నంద్యాలలో 19 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. 

Read More