అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident In Anantapur) చోటుచేసుకుంది. తిరుచానూరు నుంచి తాడిపత్రికి వస్తున్న తుఫాన్ వాహనాన్ని గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరికాసేపట్లో ఇంటికి చేరతామనగా.. మృత్యువు వీరిని కబలించింది. TRS: రాజ్యసభ సభ్యులుగా కేశవరావు, సురేశ్ రెడ్డి ప్రమాణం
ఈ ప్రమాదం తాడిపత్రి శివారు వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగింది. ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతులను హేమలత, వెంకట రంగయ్య, సుబ్రమణ్యంగా గుర్తించారు. చనిపోయినవారంతా తాడిపత్రి వాసులని సమాచారం. మరికొన్ని నిమిషాల్లో ఇళ్లు చేరతామనుకున్న వీరికి విషాదం ఎదురైంది. Gold Rate Today: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
ఫొటో గ్యాలరీలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYeR