Home> ఏపీ
Advertisement

నేడు తిరుపతికి రాహుల్ గాంధీ!

నేడు తిరుపతికి రాహుల్ గాంధీ!

నేడు తిరుపతికి రాహుల్ గాంధీ!

తిరుపతి: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి ఇవాళ మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన అక్కడి నుంచి నేరుగా తిరుమలకు వెళ్లి అక్కడ శ్రీవారిని దర్శించుకోనున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతిలో జరిగే ప్రత్యేక హోదా భరోసా యాత్రలో పాల్గొననున్నారు. ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 

తిరుపతిలో రాహుల్ గాంధీ సభ విజయవంతం చేసేందుకు ఏపీకి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాహుల్ గాంధీ పర్యటనతో రానున్న ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది.

Read More