Home> ఏపీ
Advertisement

బస్సు బోల్తా పడి 33 మందికి గాయాలు

కర్ణాటకలో క్వారంటైన్‌ ముగించుకుని స్వస్థలాలకు వెళ్తున్న పశ్చిమ బెంగాల్ వాసులు శ్రీకాకుళం జిల్లా మందస మండలం బాలిగాం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పశ్చిమ బెంగాల్‌కి చెందిన 42 మంది వలస కూలీలు ( Migrant workers from West Bengal ) ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు బాలిగాం సమీపంలో బోల్తా పడింది.

బస్సు బోల్తా పడి 33 మందికి గాయాలు

శ్రీకాకుళం : కర్ణాటకలో క్వారంటైన్‌ ముగించుకుని స్వస్థలాలకు వెళ్తున్న పశ్చిమ బెంగాల్ వాసులు శ్రీకాకుళం జిల్లా మందస మండలం బాలిగాం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పశ్చిమ బెంగాల్‌కి చెందిన 42 మంది వలస కూలీలు ( Migrant workers from West Bengal ) ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు బాలిగాం సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 33 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా పశ్చిమ బెంగాల్‌కి చెందిన వలస కూలీలేనని మందస పోలీసులు గుర్తించారు.

fallbacks

ఇటీవల లాక్ డౌన్ నిబంధనలు ( Lockdown rules eased ) సడలించడంతో దేశం నలుమూలలా చిక్కుకున్న వలసకూలీలు వారివారి స్వస్థలాలకు తరలిపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కర్ణాటకలో ఉన్న వలసకూలీలు పశ్చిమ బెంగాల్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Read More