Home> ఏపీ
Advertisement

తెలంగాణను దోచుకుంది వాళ్లే : పవన్ కల్యాణ్

తెలంగాణ అన్నా.. తెలంగాణ ప్రజలన్నా నాకు పిచ్చి ప్రేమ : పవన్ కల్యాణ్

తెలంగాణను దోచుకుంది వాళ్లే : పవన్ కల్యాణ్

తెలంగాణ ప్రాంతమన్నా.. తెలంగాణ ప్రజలన్నా తనకు ఎంతో ప్రేమ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అభిప్రాయపడ్డారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం హైదరాబాద్‌లోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జెండా ఎగురవేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ''తెలంగాణ ప్రాంతం అంటే తనకు పిచ్చి ప్రేమ' అని అన్నారు. వీర తెలంగాణ పోరాటం నేపథ్యం గురించి పుస్తకాల్లో చదివానని చెబుతూ.. తెలంగాణలో అయినా, ఉత్తరాంధ్రలో అయినా.. ఆయా ప్రాంతాలు వెనుకబాటుతనానికి, దోపిడికి గురికావడానికి కారణం ఒక ప్రాంతమో లేక ఒక కులమో కాదు.. అధికారంలో ఉన్న పాలకులు, వారి కుటుంబాలే అని పవన్ తేల్చిచెప్పారు. తెలంగాణలో పార్టీని దశలవారీగా బలోపేతం చేయనున్నట్టు ఈ సందర్భంగా పవన్ స్పష్టంచేశారు. 

తెలంగాణ ప్రాంత ప్రజలు, యువత, విద్యార్థులు, మహిళా లోకం ఆశించిన విధంగా జనసేన పార్టీని నిర్మిద్దాం. తద్వారా తెలంగాణ ప్రజలు అశించిన బంగారు తెలంగాణను సాధించుకుందాం. బలం ఉన్న చోట పోటీ చేద్దాం.. మిగిలిన చోట్ల  ప్రభావితం చేద్దాం అని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులకు సూచించారు. 

Read More