Home> ఏపీ
Advertisement

రామ్ మాధవ్‌ని అందుకే కలిశాను : పవన్ కల్యాణ్

రామ్ మాధవ్‌తో భేటీపై స్పందించిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్

రామ్ మాధవ్‌ని అందుకే కలిశాను : పవన్ కల్యాణ్

అమెరికాలో తానా ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్లిన పవన్ కల్యాణ్ అక్కడ బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్‌తో సమావేశమవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు బీజేపీలో చేరుతున్న ప్రస్తుత తరుణంలో వీళ్లిద్దరి మధ్య జరిగిన భేటీ రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేకెత్తించడమే కాకుండా రకరకాల చర్చలకు హేతువు అయిది. 

అయితే, ఇదే విషయమై స్పందించిన పవన్ కల్యాణ్.. తాను రామ్ మాధవ్‌ని కలవడంపై వివరణ ఇచ్చారు. ఆయనకు తనకు మధ్య వున్న పాత పరిచయంతోనే రామ్ మాధవ్‌ను కలిశానని, అంతకుమించి దీనివెనుక ఆపరేషన్ ఆకర్ష్ లాంటివేమీ లేవని తేల్చిచెప్పారు. బీజేపీతో తనకు వ్యక్తిగత విభేదాలేవీ లేవని స్పష్టంచేసిన పవన్ కల్యాణ్... ఏపీకి ప్రత్యేకహోదా గురించి ప్రశ్నించేందుకే కలిశానని అన్నారు.

Read More