Home> ఏపీ
Advertisement

త్రీడీ సినిమా చూస్తూ వ్యక్తి గుండెపోటుతో మృతి

త్రీడీ సినిమా చూస్తూ కడప జిల్లాలో ఒక వ్యక్తి మృతి చెందాడు.

త్రీడీ సినిమా చూస్తూ వ్యక్తి గుండెపోటుతో మృతి

కడప: త్రీడీ సినిమా చూస్తూ ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ప్రొద్దుటూరులో సోమవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. బాషా(43) బేల్దారి పని చేస్తుంటాడు. సోమవారం పట్టణంలోని ఓ థియేటర్‌లో అవేంజర్స్ త్రీడీ సినిమాకు వచ్చాడు. సినిమా అయిపోయాక అందరూ హాల్ లోంచి బయటికి వెళుతున్న సమయంలో అతను ఉలుకూపలుకూ లేకుండా సీట్లోనే ఉండిపోయాడు. థియేటర్ నిర్వాహకులు అక్కడికి చేరుకొని ప్రవేట్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. మృతి చెందిన బాషాకి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

సినిమా దృశ్యాలు చూస్తూ అతడు భయపడి చనిపోయాడా? లేక సహజ మరణమేనా? అనేది తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Read More