Home> ఏపీ
Advertisement

వైసీపీకి ఎందుకంత వణుకు: నాదెండ్ల మనోహర్

ఇటీవలే భారతీయ జనతా పార్టీతో చేయి కలిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దేశ రాజధానిలో బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాతో సుదీర్ఘ మంతనాలు జరిపిన  విషయం తెలిసిందే. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను తీవ్రంగా పరిగణిస్తున్న తరుణంలో పల్లెల్లో 

వైసీపీకి ఎందుకంత వణుకు: నాదెండ్ల మనోహర్

అమరావతి : ఇటీవలే భారతీయ జనతా పార్టీతో చేయి కలిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దేశ రాజధానిలో బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాతో సుదీర్ఘ మంతనాలు జరిపిన  విషయం తెలిసిందే. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను తీవ్రంగా పరిగణిస్తున్న తరుణంలో పల్లెల్లో నేతలు దూకుడు పెంచారు. దీనిపై జనసేన అగ్రనేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

బీజేపీ, జనసేన పొత్తు రాష్ట్రానికి అన్నీ రకాలుగా ప్రయోజనం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. జనసేన, బీజేపీ కలయిక చూసి వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని, వారిలో వణుకు పుడుతోందని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలోనే రాజధాని ఉండాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Read More