Home> ఏపీ
Advertisement

YSRCP నేత, మాజీ ఎమ్మెల్యే చినబాబు కన్నుమూత

గత కొంతకాలం నుంచి మాజీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల వరుస మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత కూనపరెడ్డి రాఘవేంద్రరావు (చినబాబు)  (Kunapareddy Veera Raghavendra Rao Passed Away) కన్నుమూశారు.

YSRCP నేత, మాజీ ఎమ్మెల్యే చినబాబు కన్నుమూత

ఏపీలో మరో విషాదం చోటుచేసుకుంది. గత కొంతకాలం నుంచి మాజీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల వరుస మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ (YSRCP) నేత కూనపరెడ్డి రాఘవేంద్రరావు (చినబాబు) కన్నుమూశారు. గత కొద్దికాలం నుంచి అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న చినాబాబు గురువారం ఉదయం తుదిశ్వాస (Kunapareddy Veera Raghavendra Rao Passed Away) విడిచారు. మాజీ ఎమ్మెల్యే మరణంతో పెనుగొండలో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.  COVID19 Vaccine: నవంబర్ 1 నుంచి అమెరికాలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ

కూనపరెడ్డి రాఘవేంద్రరావు  మృతిపట్ల ఆచంట ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి శ్రీ రంగనాథరాజు సంతాపం ప్రకటించారు. చినబాబు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుబూతి తెలిపారు. 1999 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పెనుగొండ నుంచి చినబాబు విజయం సాధించారు. అనంతరం టీడీపీలో చేరారు. చిరంజీవి మీద అభిమానంతో 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2014లో వైఎస్సార్‌సీపీలో చేరిన చినబాబు.. ఆచంట నియోజకవర్గం కన్వినర్‌గా పనిచేశారు. పార్టీ నేతలు, జిల్లా నేతలు చినబాబు మృతిపట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. AP ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు 
Anchor Anasuya Hot Photos: యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫొటోలు

 టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ Hot Pics 
Photo Gallery: ప్రియుడితో కలిసి నయనతార ఓనమ్ సెలబ్రేషన్స్ 

Read More