Home> ఏపీ
Advertisement

కుప్పంలో చంద్రబాబుకి పోటీగా మాజీ ఐఏఎస్..!

మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని కుప్పం నుంచి అభ్యర్థిగా ప్రకటించిన జగన్

కుప్పంలో చంద్రబాబుకి పోటీగా మాజీ ఐఏఎస్..!

మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని కుప్పం నుంచి అభ్యర్థిగా ప్రకటించిన జగన్.. బీసీలు ఎక్కువగా ఉన్న ఆ నియోజక‌వర్గం నుండి ఎన్నికైన చంద్రబాబు ఆ కులాలకు ఇప్పటి వరకూ చేసింది ఏమీలేదని విమర్శించారు. తమ పార్టీ గెలుపు కుప్పం నియోజకవర్గం నుంచే ప్రారంభం అవుతుందని జగన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తేనే.. బీసీలకు నిజమైన మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం వైయస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఘనంగా సాగుతోంది. ఆ యాత్రలో భాగంగానే కుప్పం వచ్చిన జగన్, ఆ నియోజకవర్గ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించారు. చంద్రబాబుపై పోటీ చేయబోయే కె.చంద్రమౌళి గతంలో కడప జిల్లా కలెక్టరుగా పనిచేశారు. ఆయన 1975 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 

Read More