Home> ఏపీ
Advertisement

రోజాను పెట్టి 'జీఎస్‌టీ' తీస్తా: సంచలన వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్

టాలీవుడ్ దర్శకుడు అజయ్ కౌండిన్య వైసిపీ ఎంఎల్ఏ రోజాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజా ఒప్పకుంటే.. ఆమెను పెట్టి ' గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' సినిమా తీస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసి దుమారానికి తెరలేపారు.

రోజాను పెట్టి 'జీఎస్‌టీ' తీస్తా: సంచలన వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్

టాలీవుడ్ దర్శకుడు అజయ్ కౌండిన్య వైసిపీ ఎంఎల్ఏ రోజాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజా ఒప్పుకుంటే.. ఆమెను పెట్టి 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' సినిమా తీస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసి దుమారానికి తెరలేపారు. ఓ సినిమా ఫంక్షన్ లో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలోనే ఆయన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పవన్ కళ్యాణ్, గాయత్రి గుప్తాలపై కూడా మండిపడ్డారు. 

ప్రతి సమస్యపై స్పందించే రోజా.. సినీ పరిశ్రమ సమస్యలపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ఇండస్ట్రీలో ఉన్న సమస్యల గురించి రోజాకు తెలుసని.. అయినా కూడా వాటిపై స్పందించడానికి ఆమె ఇష్టపడటం లేదని చెప్పారు. ఇదే సమయంలో ఆయన రాంగోపాల్ వర్మ 'జీఎస్‌టీ'ని తెరపైకి తెచ్చారు. వర్మ ఎవరో ఒక విదేశీ వనితతో 'జీఎస్‌టీ' సినిమా తీశాడని.. రోజాతో తీసుకుంటే బాగుండని సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజా ఒప్పుకుంటే.. జీఎస్‌టీ2 తీస్తానని చెప్పి వివాదానికి తెరలేపారు. 

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వద్దకు సమస్యలను ఏకరువు పెట్టుకోవడానికి వెళితే.. ఒక బాధ్యతగల మంత్రి పదవిలో ఉండి.. ఎవరో శ్రీశైలంయాదవ్ ను కలవమంటున్నాడని చెప్పారు. ఎప్పుడూ ఎదో ఒక అంశాన్ని తీసుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించే పవన్ కళ్యాణ్.. సినీ ఇండస్ట్రీ సమస్యల గురించి ఎందుకు ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. అలానే టీవీలో గాయత్రిగుప్తా సినీఇండస్ట్రీలో అమ్మాయిలను నిర్మాతలు, దర్శకులు వాడుకుంటున్నారని చెప్పడంపై కూడా గరం అయ్యారు. సినీ ఇండస్ట్రీలో జరిగేది ఏందో తెలుసుకొని మాట్లాడాలని సూచించారు.   

Read More