Home> ఏపీ
Advertisement

కరోనా సెకండ్ వేవ్: ఏపీలో కరోనా కేసులపై లేటెస్ట్ హెల్త్ అప్‌డేట్స్

Coronavirus cases in Andhra pradesh: హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,442 కరోనా వైరస్ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 16 మంది కరోనాతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కరోనావైరస్‌ బారినపడిన వారిలో గత 24 గంటల్లో 2,412 మంది కోలుకున్నారు.

కరోనా సెకండ్ వేవ్: ఏపీలో కరోనా కేసులపై లేటెస్ట్ హెల్త్ అప్‌డేట్స్

Coronavirus cases in Andhra pradesh: హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,442 కరోనా వైరస్ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 16 మంది కరోనాతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కరోనావైరస్‌ బారినపడిన వారిలో గత 24 గంటల్లో 2,412 మంది కోలుకున్నారు. తాజాగా నమోదైన కరోనా కేసులతో కలిపి ఏపీలో ఇప్పటివరకు వెలుగుచూసిన కరోనావైరస్ పాజిటివ్‌ కేసులు సంఖ్య మొత్తం 19,73,996కు చేరాయి. 

ఇప్పటివరకు 19,40,368 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య మొత్తం 13,444 కు పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 85,822 మందికి కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో (AP Health bulletin) పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 20,184 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ఇదిలావుంటే, కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం ఏపీ సర్కారు ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ (Night curfew in AP) అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే.

Read More