Home> ఏపీ
Advertisement

ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబు ఘాటు హెచ్చరిక

ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబు ఘాటు హెచ్చరిక

ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబు ఘాటు హెచ్చరిక

అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ ఇలాగే వ్యవహరిస్తే, భవిష్యత్‌లో ఆయన భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. దేశాన్ని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే తాము పోరాటం సాగిస్తున్నామని, అడ్డుకోవడానికి మీరు ఎవరని ప్రధాని మోదిని చంద్రబాబు ప్రశ్నించారు. అంతేకాకుండా ''మీరు ఇక దిగిపోయే ప్రధాని'' అని మోదీపై మండిపడ్డారు. టీడీపి నేతల నివాసాలు, కార్యాలయాలపై ఐటి, ఇడి దాడులు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తూ చంద్రబాబు శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు. 

టీడిపి నేతలపై అధికారుల దాడులను ఖండిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకే దాడులు జరుపుతున్న అధికారులు ఇంకా ప్రధాని ఆదేశాలను పట్టించుకోవద్దని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఒకసారి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాకా దాడులకు సంబంధించిన ఆదేశాలు ఏవైనా ఎన్నికల సంఘం నుంచి వెలువడాలి కాని ప్రధాని నుంచి కాదని చంద్రబాబు పేర్కొన్నారు.

Read More