Home> ఏపీ
Advertisement

వివేకా హత్యపై జగన్ కు ప్రశ్నలు సంధించిన చంద్రబాబు

                                     

వివేకా హత్యపై జగన్ కు ప్రశ్నలు సంధించిన చంద్రబాబు

వైఎస్ వివేకా హత్య కేసు నేపథ్యంలో వైసీపీ చేస్తున్న ఆరోపణలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. వైఎస్ వివేకానంద మరణ వార్త తనను కలిచివేసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఉండవల్లిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వైసీపీ నేతలు టీడీపీపై చేస్తున్న విమర్శలపై ఎదురుదాడి చేశారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ కు చంద్రబాబు పలు ప్రశ్నలు సంధించారు.

సాక్షాలు తారుమారు ఎందుకు చేశారు...

వివేకా హత్య జరిగిన విషయం క్లియర్ గా తెలిసినప్పటికీ ..మొదట గుండెపోటు అని ఎందుకు నాటకాలు ఆడారని చంద్రబాబు ప్రశ్నించారు. ఇదే విషయాన్ని జనాలను నమ్మించే ప్రయత్నం ఎందుకు చేశారు. మెదడు కూడా బయటికి వచ్చినంత పెద్ద గాయం జరిగినప్పటికీ హత్య అని కుటుంబ సభ్యులు ఎందుకు బయటకు చెప్పలేకపోయారు. రక్తపు మరకలు ఉన్న రూంను ఎవరు క్లీన్ చేశారు .. డెడ్ బాడీని బాత్ రూంలో నుంచి బెడ్ రూంలోకి ఎవరు తీసుకుపోయారు. ఉదయం లేని లెటర్ ..సాయంత్రానికి ఎలా తయారైంది. ఇందంతా సాక్షాలు తారుమారు చేసేందుకు చేసిన కుట్ర అని చంద్రబాబు ఆరోపించారు. ఒక  కుటుంబ సభ్యుడు చనిపోయినా సాక్షాలు లేకుండా చేయాలని చూసిన తీరు చూస్తుంటే తనకు బాధేస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు

శవ రాజకీయాలు మానుకోవాలి..

హత్య రాజకీయాలు చేయడం వైసీపీ వాళ్లకు వెన్నెతో పెట్టిన విద్య అని చంద్రబాబు విమర్శించారు. ఇంత దారుణం చేసి ఈ హత్య టీడీపీ వారే చేశారనే నాటకాలు ఆడుతున్నారని చంద్రబాబు దయ్యబట్టారు. ఒక సారిపై నాపై ఆరోపణలు చేస్తారు..మళ్లీ లోకేష్ పేరు చెబుతారు..మరోసారి టీడీపీ నేతలు చేశారంటూ వైసీపీ వారు అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. ఈ కేసులో నిందితులు ఎవరైనా వదిలిపెట్టేది లేదు. ఇంత దారుణం చేసి దాన్ని కప్పిపుచ్చుకునేందుకు..ఇప్పుడు సీబీఐ అంటూ డ్రామాలు ఆడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. హత్య చేసిన తర్వాత ఆ సాక్షాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించడం దారుణం. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం దారుణమని వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించిన  చంద్రబాబు పరోక్ష విమర్శలు సంధించారు

Read More