మే 5వ తేదీ నుంచి ఏపీ టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా ఈ నెల 22వ తేదీతో ఫీజు చెల్లింపునకు సమయం ముగుస్తుంది. మే 23వ తేదీ దరఖాస్తు పంపే గడువు కూడా ముగియనుండగా.. కఆప్లై చేసేవారు చివరి తేదీ వరకూ వేచి చూడకపోవడం మంచిది. ఈనెల 25న మాక్టెస్టులు అందుబాటులో ఉంటాయన్న అధికారులు.. జూన్ 3వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని, జూన్ 10 నుంచి పరీక్షలు జరుగుతాయన్నారు.
ఒక్కో పేపర్కు రూ.500 చొప్పున విడివిడిగా పరీక్ష ఫీజు చెల్లించాలి. అభ్యర్థులు ఒక్కసారి దరఖాస్తును పూర్తి చేసి, ఆన్లైన్లో సమర్పిస్తే ఎలాంటి మార్పులకు అవకాశం ఉండదు. ఒకవేళ అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తులో తప్పుగా నమోదు చేస్తే మరోసారి కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిందే. ఇందుకోసం అదనంగా మరో రూ.500 చెల్లించాలి. కనుక దరఖాస్తు చేసుకోనేటప్పుడే జాగ్రత్తగా వివరాలను నమోదు చేయండి.
నోటిఫికేషన్ ప్రకారం టెట్లో ఈసారి కొత్తగా వ్యాయామ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా పేపర్-2(బి) ప్రవేశపెట్టారు. గతంలో టెట్ను మూడుపేపర్లుగా నిర్వహించగా ఈసారి రెండు పేపర్లకే పరిమితం చేశారు. కానీ, పేపర్-2ను ఏ, బీగా విభజించారు. పేపర్-1ను ఎస్జీటీలకు, పేపర్-2(ఎ)ను గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రం, భాషా పండితులకు, పేపర్-2(బి)ని వ్యాయామ ఉపాధ్యాయుల కోసం నిర్వహిస్తారు.
ఏపీటెట్ - 2018 షెడ్యూల్...
టెట్కు దరఖాస్తు చేసేవారికి సూచనలు: