Home> ఏపీ
Advertisement

ఏపీలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు, 16 వ తేదీ నుంచి స్కూల్స్ ప్రారంభం

AP Corona Update: కరోనా మహమ్మారి ఇప్పుడు తగ్గుముఖం పడుతోంది. గత కొద్దిరోజులుగా కరోనా వైరస్ కేసుల తగ్గుదల స్థిరంగా కొనసాగుతోంది. కేసులు తగ్గడంతో స్కూళ్లు తెరిచేందుకు సిద్దమవుతోంది ఏపీ ప్రభుత్వం.

ఏపీలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు, 16 వ తేదీ నుంచి స్కూల్స్ ప్రారంభం

AP Corona Update: కరోనా మహమ్మారి ఇప్పుడు తగ్గుముఖం పడుతోంది. గత కొద్దిరోజులుగా కరోనా వైరస్ కేసుల తగ్గుదల స్థిరంగా కొనసాగుతోంది. కేసులు తగ్గడంతో స్కూళ్లు తెరిచేందుకు సిద్దమవుతోంది ఏపీ ప్రభుత్వం.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) ప్రభావం దాదాపుగా తగ్గుతోంది. కరోనా వైరస్ కేసులు తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో 71 వేల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా..1869 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణైంది. మరోవైపు 18 మంది కరోనా వైరస్ బారినపడి మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 13 వేల 582 మంది మరణించారు. గత 24 గంటల్లో 2 వేల 316 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 19 లక్షల 55 వేల 52 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 19 లక్షల 85 వేలకు చేరుకుంది. ఏపీలో ఇప్పటి వరకూ రాష్ట్రంలో 2 కోట్ల 53 లక్షల 82 వేల 763 మందికి కోవిడ్ నిర్దారణ పరీక్షలు(Covid19 Tests)చేశారు.  

Also read: ఒలింపిక్స్‌లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారిణి రజనీకు సత్కారం, పలు ప్రోత్సాహకాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More