Home> ఏపీ
Advertisement

దేశ వ్యాప్తంగా మోడీ వ్యతిరేక గాలి - మంత్రి యనమల

                       

దేశ వ్యాప్తంగా మోడీ వ్యతిరేక గాలి - మంత్రి యనమల

ఉప ఎన్నికల ఫలితాలపై ఏపీ మంత్రి యనమల స్పందించారు. ఫలితాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా మోడీ వ్యతిరేకగాలి వీస్తుందని.. ఈ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. కర్నాటక ఎన్నికలతో ప్రారంభమైన బీజేపీ పతనం  2019 ఎన్నికలతో బీజేపీ ఓటమి పరిసమాప్తమవుతుందని యనమల జోస్యం చెప్పారు. వరస ఓటములు ఎదురౌతున్నా ఇప్పటి వరకు కమలనాథులు ఆత్మవిమర్శ చేసుకోకపోవడం సిగ్గు చేటున్నారు. బీజేపీ హాయంలో ఏపీతో సహా దేశంలోని చాలా రాష్ట్రాలకు అన్యాయం జరిగిందన్నారు. కేంద్రం నిధులన్నీ గుజరాత్, మహారాష్ట్రలకే తరలిస్తున్నారని ఆరోపించారు.

ఏపీలో కూడా బీజేపీ పుట్టగతులుండని యనమల జోస్యం చెప్పారు. బీజేపీ ఓవైపు వైసీపీ అధినేత జగన్ తో లాలూచీ రాజకీయాలు చేస్తూనే మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో టీడీపీపై విమర్శలు చేయిస్తున్నారని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని ఏపీ మంత్రి యనమల వెల్లడించారు. బీజేపీ వ్యూహాలు ఏపీలో పనిచేయవని వ్యాఖ్యానించారు. టీడీపీని ఇరుకున పెట్టేందుకు బీజేపీ ఏమైన పిచ్చి వ్యూహాలు పన్నితే  అవి వారికే బెడిసికొడతాయని మంత్రి యనమల వ్యాఖ్యానించారు.

Read More