Home> ఏపీ
Advertisement

అడుగుపెట్టాలంటే క్షమాపణలు చెప్పాల్సిందే ; ప్రధాని మోడీ ఏపీ పర్యటనపై మంత్రి గంటా హాట్ రియాక్షన్

ప్రధాని మోడీ ఏపీ పర్యటన నేపథ్యంలో టీడీపీ విమర్శల దాడి ముమ్మరం చేసింది

అడుగుపెట్టాలంటే క్షమాపణలు చెప్పాల్సిందే ; ప్రధాని మోడీ ఏపీ పర్యటనపై మంత్రి గంటా హాట్ రియాక్షన్

ప్రధాని మోడీ జనవరి 6న గుంటూరులో పర్యటించేందుకు షెడ్యూల్ రెడీ అయింది. ఈ నేపథ్యంలో మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందిస్తూ ఏపీ ప్రజలకు మోసం చేసిన ప్రధాని మోడీ ..క్షమాపణుల చెప్పిన తర్వాతే ఈ రాష్ట్రంలో అడుపెట్టాలని మంత్రి గంటా డిమాండ్ చేశారు. ఈ రోజు తిరుమలలో మంత్రి గంటా శ్రీవారి దర్శించుకున్నారు. అనంతరం మీడియా ముందుకు వచ్చి ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన హామీలు నెరవేర్చకుండా మోడీ ప్రజలకు మోసం చేశారని ఆరోపించారు. ఏ హక్కుతో ఆయన ఈ రాష్ట్రానికి వస్తున్నారో  సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఏపీలో పర్యటించే నైతిక హక్కు ప్రధాని మోడీకి లేదన్నారు.  ఆయన ఏపీలో పర్యటించాలంటే ముందుగా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఈ సందర్భంగా మంత్రి గంటా డిమాండ్ చేశారు. 

Read More