Home> ఏపీ
Advertisement

AP COVID-19: 6లక్షలు దాటిన కరోనా రికవరీల సంఖ్య

ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కాస్త ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కేసులతోపాటు రికవరీ రేటు కూడా క్రమంగా పెరుగుతోంది.

AP COVID-19: 6లక్షలు దాటిన కరోనా రికవరీల సంఖ్య

Andhra Pradesh Covid-19 updates: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కాస్త ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కేసులతోపాటు రికవరీ రేటు కూడా క్రమంగా పెరుగుతోంది. తాజాగా.. గత 24గంటల్లో ( శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9గంటల వరకు ) 76,416 శాంపిళ్లను పరీక్షించగా.. 6,923 కరోనా కేసులు నమోదు కాగా.. 45 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో.. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,75,674 కి చేరగా.. ఈ మహమ్మారితో ఇప్పటివరకు 5,708 మంది మరణించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యఆరోగ్యశాఖ ( AP Health Ministry ) ఆదివారం సాయంత్రం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: SP Balasubrahmanyam News: వదంతులు సృష్టించి బాధపెట్టొద్దు: ఎస్పీ చరణ్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం  64,876 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉండగా.. ఇప్పటివరకు 6,05,090 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 56,00,202 కరోనా నమూనాలను పరీక్షించినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అంతేకాకుండా గడచిన 24 గంటల్లో 7,796 మంది కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే.. జిల్లాల వారీగా కరోనా కేసులు, మరణాల వివరాలు ఇలా ఉన్నాయి..

fallbacks

Read More