Home> ఏపీ
Advertisement

అగ్రిగోల్డ్ బాధితుల కోసం ప్రత్యేక సెల్

అగ్రిగోల్డ్ బాధితుల కోసం ప్రత్యేకంగా ఓ సెల్ ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ నేత డిమాండ్

అగ్రిగోల్డ్ బాధితుల కోసం ప్రత్యేక సెల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితుల కోసం ప్రత్యేకంగా ఓ సెల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత లేళ్ల అప్పి రెడ్డి. ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి.. విచారణ పేరుతో కేసుని సాగదీసి అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం చేయొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బాధితుల పట్ల ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి వుంటే, వారికి నష్టపరిహారం అందించే దిశగా ప్రభుత్వం వెంటనే ఓ రిడ్రసల్ సెల్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా అప్పి రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

అగ్రిగోల్డ్ బాధితుల సంఘం తరపున ప్రతినిధిగాను వ్యవహరిస్తున్న అప్పి రెడ్డి.. "అగ్రిగోల్డ్ బాధితులు తమకు అవసరమైన సమాచారం తెలుసుకునే విధంగా ప్రభుత్వం అధికారికంగా ఓ వెబ్‌సైట్‌ని రూపొందించి.. అందులో అగ్రిగోల్డ్ బాధితుల పేర్లు, వారి వివరాలు పొందుపర్చాలి" అని అన్నారు. 

Read More