Home> ఏపీ
Advertisement

త్వరలోనే 19,170 వార్డు వాలంటీర్ల భర్తీ

త్వరలోనే 19,170 వార్డు వాలంటీర్ల భర్తీ

త్వరలోనే 19,170 వార్డు వాలంటీర్ల భర్తీ

అమరావతి: ఏపీలో త్వరలోనే మరో ఉద్యోగాల ప్రకటన వెలువడనుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వార్డు వాలంటీర్ పోస్టులను నవంబర్ 3వ వారంలోపు పూర్తిచేయాలని సీఎం జగన్ ఆదేశించిన నేపథ్యంలో త్వరలోనే ఆయా ఖాళీల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల కానుంది. వివిధ పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థలు కలుపుకుని ప్రస్తుతం ఖాళీగా ఉన్న 19,170 వార్డు వాలంటీర్ల పోస్టుల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ విజయ్‌ కుమార్‌ తెలిపారు. 

మొత్తం ఖాళీల సంఖ్య: 19,170 వార్డు వాలంటీర్లు. 
నవంబర్ 1 నుండి అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు: నవంబర్ 10
నవంబర్ 15 వరకు దరఖాస్తులు పరిశీలన
నవంబర్ 16 నుండి 20 వరకు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు
నవంబర్‌ 22న ఎంపికైన వార్డు వాలంటీర్ల జాబితా విడుదల
డిసెంబర్ 1 నాటికి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి.

Read More